మెట్రో రైలులో ప్రయాణించిన ప్రధాని మోదీ: విద్యార్థులతో సరదా ముచ్చట్లు
ప్రధాని నరేంద్ర మోదీ సామాన్య ప్రయాణికులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ప్రఖ్యాత శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఆయన ఈ సాధారణ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. ఎంతో నిరాండంబరంగా మెట్రో స్టేషన్ వద్ద టికెట్ గేట్ దగ్గర స్మార్ట్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చి మరీ ఆయన ప్రయాణం సాగించారు.
మెట్రో కోచ్లోని ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులు, యువతతో ప్రధాని మోదీ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వారి భవిష్యత్తు ఆకాంక్షల గురించి తెలుసుకున్నారు. ఒక చిన్నారి పుట్టినరోజు వేడుక గురించి తెలిసి ఆయన ముందస్తు శుభాకాంక్షలు తెలపగా, మరో బాలుడు ప్రధానితో సరదాగా మాట్లాడి ఆకట్టుకున్నాడు. వీఐపీ భద్రతా వలయాలను పక్కన పెట్టి, సామాన్య ప్రజల మధ్య ప్రధాని ప్రయాణించిన తీరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలోనూ పలు సందర్భాల్లో మెట్రో ప్రయాణాలను ఎంచుకున్న మోదీ, మరోసారి తన సరళ స్వభావాన్ని చాటుకున్నారు