బెంగళూరు పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి
ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో కీలక భేటీ!
హైదరాబాద్/బెంగళూరు: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బెంగళూరుకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు మరియు పార్టీ అంతర్గత అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇటీవల వార్తల్లో నిలిచిన మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై ఖర్గేతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు బెంగళూరు పర్యటనకు ముందు మంత్రి కొండా సురేఖ భర్త, కాంగ్రెస్ నేత కొండా మురళి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భట్టిని కొండా మురళి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భట్టి-ఖర్గే సమావేశం తర్వాత అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.