BREAKING
కొండా సురేఖ విషయంలో సీఎం మాటే నా మాట.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాఖీ పౌర్ణమి వేళ ఈ 4 రాశులకు అదృష్టం.. అరుదైన యోగాలతో డబుల్ బెనిఫిట్స్! బెంగళూరు పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ బ్యూటీ.. వారానికి రూ.4 లక్షల రెమ్యునరేషన్ అంటూ టాక్! కేరళ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగానే జాతీయ రహదారుల నిర్మాణం జరగాలి మంత్రి పదవి కోసం కేకే జోరుగా లాబీయింగ్ నయా దోపిడీకి తెరదీసిన ముఠాలు! కీలక ఖనిజాల వైపు సింగరేణి పరుగులు స్పెయిన్‌లో ‘లా టొమాటినా’ వేడుకలు హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రద్దీ కాస్త తగ్గనుంది! హిడ్మా గన్‌మెన్ ముచ్చిక మంగి లొంగుబాటు బీహార్‌లో వరద ముప్పుపై సీఎం సామ్రాట్ చౌదరితో అమిత్ షా సంభాషణ మాస్కోలో CIA చీఫ్ పర్యటన ఆకస్మిక వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు తిరుమల భక్తులకు బిగ్ గుడ్‌న్యూస్.. ఇక తిరుపతికి మరింత స్పీడ్‌గా! కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

కొండా సురేఖ విషయంలో సీఎం మాటే నా మాట.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Select Suryaa Now
కొండా సురేఖ విషయంలో సీఎం మాటే నా మాట.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అధిష్ఠానం నిర్ణయమే తుది.. భట్టి విక్రమార్కతో భేటీపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన వేళ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయమే అంతిమమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం చెబితే.. అదే తన అభిప్రాయమని తేల్చిచెప్పారు.

‘సీఎం మాటే నా మాట’

కొండా సురేఖ, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి అంశంపై పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ అంశంలో ఇక అధిష్ఠానం నిర్ణయం కోసం ఎదురుచూడాల్సి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తన అభిప్రాయాన్ని వెల్లడించారని.. ‘సీఎం మాటే నా మాట’ అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

భట్టి భేటీపై అసలు విషయం ఇదే

మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో తన భేటీపై వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. కొండా సురేఖ వ్యవహారంలో రాయబారం చేసేందుకే భట్టిని కలిశానన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి, నిధుల కేటాయింపు అంశాలపైనే డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు వెల్లడించారు.

అధిష్ఠానం నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు

కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలించి టీపీసీసీకి నివేదిక అందించిందని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయమే కీలకమని పేర్కొన్నారు. అధిష్ఠానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

తనపై ప్రచారంపైనా ఆగ్రహం

ఇదే సమయంలో తనపై కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారంపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వాస్తవాలను వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొండా సురేఖ వివాదంలో తన పాత్రపై జరుగుతున్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలతో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.