BREAKING
అట్టముక్కల వైద్యం....! రాష్ట్రంలో త్వరలో ఇందిరమ్మ బీమా పథకం.. విద్యార్థులను భవిష్యత్తు మానవ వనరులుగా తీర్చిదిద్దడం లక్ష్యం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కు.. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ

అట్టముక్కల వైద్యం....!

Select Suryaa Now
అట్టముక్కల వైద్యం....!

 

ముఖ్యమంత్రి జిల్లాలో ఇదేం దుస్థితి....?

పరిగి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవలకు కొరవడిన సౌకర్యాలు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ :ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 50 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికీ అత్యవసర వైద్య సేవలకు అవసరమైన కనీస పరికరాలు అందుబాటులో లేవని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు.

ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగిన క్షతగాత్రులకు ఫ్రాక్చర్‌ స్ప్లింట్లు, పీఓపీ స్లాబ్‌లు, క్రేప్ బ్యాండేజీలు వంటి వైద్య సామగ్రితో చికిత్స అందించాల్సి ఉండగా, అట్టముక్కలను ఉపయోగించి కట్లు కడుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎముకలు విరిగిన రోగులకు ప్రథమ చికిత్స చేసి, అనంతరం ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడమే పరిపాటిగా మారిందని పలువురు వాపోతున్నారు.

అత్యవసర పరికరాలు ఎక్కడ?

అత్యవసర విభాగంలో ఫ్రాక్చర్‌ స్ప్లింట్లు, పీఓపీ స్లాబ్‌లు, క్రేప్ బ్యాండేజీలు, అల్యూమినియం లేదా ఫైబర్ స్ప్లింట్లు, కార్డ్‌బోర్డ్ మెడికల్ స్ప్లింట్లు వంటి పరికరాలు అందుబాటులో ఉండాల్సి ఉన్నప్పటికీ, వాటి కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదలు, సామాన్యులు ఆధారపడే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం దారుణమని అంటున్నారు. చిన్నపాటి అత్యవసర చికిత్సకు కూడా ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి రావడంతో రోగులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టి, అత్యవసర వైద్య పరికరాలు, మందులు, అవసరమైన సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందేలా ఆసుపత్రిలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.