BREAKING
తుమ్మిడిహట్టి బ్యారేజ్‌పై ఢిల్లీలో కీలక భేటీ: సెప్టెంబర్ 1న తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల సమావేశం అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై బన్నీ రణబాలి vs Jailer 2: దసరా బరిలో విజయ్ దేవరకొండ.. రజనీకాంత్‌తో బాక్సాఫీస్ వార్! చక్కెర కొరత భయాలు నేపాల్ వరదల్లో 21 మంది తమిళనాడు యాత్రికులు సురక్షితం అల్లు అర్జున్ ‘రాకా’ రెండు భాగాలుగా.. ‘పుష్ప’ తర్వాత మరో భారీ ఫ్రాంచైజ్? నేపాల్‌కు కొనసాగుతున్న భారత సాయం బాధితులను ఆదుకోవాలని ప్రధానికి లేఖ రాస్తున్నా - మల్లికార్జున ఖర్గే భోపాల్ లో ఇందిరా గాంధీ మ్యూజియంను సందర్శించిన ఐటీడీఏ పీవో బి, రాహుల్ కవిత సంచలన ఆరోపణలు.. హరీశ్ రావు, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..? స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ విలీనంపై రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గాలి ఆటో డ్రైవర్లకు భారీ ఊరట.. రూ.1.50 లక్షల వరకు సబ్సిడీ! తెలంగాణలో కొత్త స్కీమ్‌! నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కావడం లేదు జబర్దస్త్ నరేష్ జీవితంలో ఊహించని కష్టాలు.. రూ.36 లక్షల ల్యాండ్ కొన్నాక ఏం జరిగిందంటే?

సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..?

Select Suryaa Now
సెప్టెంబర్ 2 తర్వాత మంత్రి కొండా సురేఖపై చర్యలు..?

కేసీ వేణుగోపాల్ రాకపైనే ఉత్కంఠ
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి. కొండా సురేఖపై చర్యలు తీసుకునే అంశంపై సెప్టెంబర్ 2 తర్వాత కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకోనున్నారు. కేసీ వేణుగోపాల్ రాక తర్వాతనే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీకి చేరుకున్న వెంటనే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై విస్తృతంగా చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

మరోవైపు, ఈ వివాదంలో రాయబారం నడిపేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిరాకరించారు. కొండా సురేఖ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఆయన విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, ఈ అంశంపై ఇప్పటికే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ తీసుకునే నిర్ణయమే అంతిమమని తేల్చి చెప్పారు. దీంతో కేసీ వేణుగోపాల్ రాక తర్వాత అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.