BREAKING
శ్రీధర్ గాదె కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం రూ. 1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు డీఏసీ ఆమోదం ‘చెప్పారంటే చేసి చూపిస్తారు’ నర్సాపూర్‌లో ఘనంగా ప్రజా పాలన 1,000 రోజుల విజయోత్సవ వికాస్ యాత్ర IT, మెటల్, PSU బ్యాంక్ షేర్ల పతనంతో నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ '90s' వెబ్ సిరీస్ మేజిక్ రిపీట్ చేసేందుకు ఆదిత్య హాసన్ సిద్ధం ఏఐ మానవాళి మనుగడకే తీవ్రమైన ముప్పు క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ నష్టాన్ని ఆలస్యం చేయొచ్చు చంద్రుడిపైకి చేరే క్రమంలో భారత్ ‘మా పక్కనే’ ఉండాలి ఆసియా పసిఫిక్ ఇంటర్నెట్ సదస్సు APNIC 62 భారత్-అమెరికా అంతరిక్ష బంధం నేపాల్‌లో 1,380కి చేరిన మృతులు.. నేడు జాతీయ సంతాప దినం కావేరీ డెల్టా సాగునీటి కోసం మెట్టూరు డ్యామ్ నీటి విడుదల 12,000 క్యూసెక్కులకు పెంపు 9/11 దాడులకు 25 ఏళ్లు..‘ఆ రోజే ప్రపంచం మారిపోయింది’ అన్న డోనాల్డ్ ట్రంప్ ఆగస్టులో ఆటోమొబైల్ రికార్డు విక్రయాలు

చంద్రుడిపైకి చేరే క్రమంలో భారత్ ‘మా పక్కనే’ ఉండాలి

Select Suryaa Now
చంద్రుడిపైకి చేరే క్రమంలో భారత్ ‘మా పక్కనే’ ఉండాలి

అమెరికా రాయబారి సెర్గియో గోర్
బెంగళూరు: నాసా తన ప్రతిష్టాత్మక ‘మూన్ బేస్’ కార్యక్రమంలో చేరాలని ఇస్రోను ఆహ్వానించిందని, తాము చంద్రుడిపైకి తిరిగి వెళ్లే క్రమంలో భారత్ తమ పక్కనే ఉండాలని కోరుకుంటున్నట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. బెంగళూరు స్పేస్ ఎక్స్‌పో 2026లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్టెమిస్ ఒప్పందాలపై భారత్ గర్వంగా సంతకం చేసిందని, రాబోయే రోజుల్లో రెండు దేశాలు కలిసి చంద్రుడిపై సరికొత్త చరిత్ర సృష్టించనున్నాయని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఇరు దేశాల అంతరిక్ష భాగస్వామ్య ప్రాముఖ్యతను గోర్ వివరించారు. నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం కేవలం శాస్త్ర ప్రయోగానికే పరిమితం కాదని, ప్రాణాలను కాపాడే సాధనమని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం వెనిజులా భూకంప సమయంలో దట్టమైన మేఘాలను ఛేదించి నిసార్ అందించిన రాడార్ డేటా అత్యవసర సహాయక బృందాలకు మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు.

గ్రూప్ కెప్టెన్ శుభంశుక్లా గతేడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లడం ఒక ప్రధాన మైలురాయి అని చెప్పారు. ఆక్సియమ్-4 మిషన్‌తో పాటు భవిష్యత్తులో డాకింగ్ ప్రమాణాలు, వ్యోమగాముల సంయుక్త శిక్షణపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు. పిక్సెల్, గెలాక్సీ, దిగంతర, బెల్లాట్రిక్స్, స్కైరూట్, అగ్నికుల్ వంటి భారత అంతరిక్ష స్టార్టప్‌లకు అమెరికా మార్కెట్ మరియు పెట్టుబడిదారుల తలుపులు తెరిచే ఉన్నాయని పిలుపునిచ్చారు.

అంతరిక్ష ట్రాఫిక్ సమన్వయంతో పాటు నిరంకుశ ఆధిపత్యాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛాయుత, నియమ-ఆధారిత అంతరిక్ష పాలన కోసం వాషింగ్టన్, న్యూఢిల్లీ భుజం భుజం కలిపి పనిచేస్తున్నాయని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాలు కలిస్తే అంతరిక్ష రంగంలో అద్భుతాలు సాధ్యమవుతాయని, ఆకాశమే హద్దుగా ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను కలిసి నిర్మిద్దామని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.