సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి
అనంతపురం బ్యూరో
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి కోదండరామిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని పాల్తూరు గ్రామంలో శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మురికి నీటి నిలువల వద్ద ఆయిల్ బాల్స్ ను చల్లారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.