BREAKING
*రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు* ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: సీపీ గౌస్‌ ఆలం..! ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం* మైహోం రామేశ్వరరావు భూముల కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్ మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి

ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స

Select Suryaa Now
ఆపరేషన్ అవసరం లేకుండానే  లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స

 

ఆపరేషన్ అవసరం లేకుండానే  లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స*

- తొడలోని ధమని ద్వారా కాథెటర్ పంపి కణితికి నేరుగా కీమో మందులు

*అనంతపురం బ్యూరో 

 

 

లివర్ (కాలేయం)లో ఏర్పడిన క్యాన్సర్ కణితికి శస్త్రచికిత్స లేకుండా ఓ 64 ఏళ్ల వ్యక్తికి కిమ్స్ సవీరా ఆసుపత్రి వైద్యులు అధునాతన ట్రాన్స్ఆర్టీరియల్ కీమో-ఎంబోలైజేషన్ ద్వారా చికిత్సను విజయవంతంగా చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చికిత్సనందించిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. ఎస్.కె. పృథ్వీరాజ్ మరియు కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డా. పి. వెంకట సింహా. 

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చీకలగురికి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి (64) కడుపునొప్పితో బాధపడుతూ స్థానికంగా వైద్యులను సంప్రదించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కాలేయంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఈనెల 9న కిమ్స్ సవీరా ఆసుపత్రిలో చేరారు. ఇక్కడ చేసిన పెట్ సిటి మరియు ఎఫ్ఎన్ఏసి తదితర పరీక్షలు చేశాం. ఈ పరీక్షల్లో రోగికి హెపాటోసెల్యులర్ కార్సినోమా (HCC) అనే కాలేయ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం ఆంకోసర్జరీ విభాగం వైద్యుల అభిప్రాయం తీసుకోగా, రోగి శస్త్రచికిత్సకు అనుకూలంగా లేరు. 

దీంతో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం వైద్యులు రోగి ఆరోగ్య పరిస్థితి, కణితి స్వభావం తదితర అంశాలను పరిశీలించి టిఏసిఈ చికిత్సను సూచించారు. తొడలోని ధమని ద్వారా సన్నని కాథెటర్ను కాలేయంలోని కణితికి రక్తాన్ని సరఫరా చేసే ధమని వరకు పంపించి, కీమోథెరపీ మందులను నేరుగా కణితి వద్దకు అందించడం ఈ చికిత్స ప్రత్యేకత.

సెప్టెంబరు 10న డా. ఎస్.కె. పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో టిఏసిఈ ప్రక్రియ నిర్వహించారు. ఈ విధానంలో తొడలోని ధమని ద్వారా సన్నని కాథెటర్ను ప్రవేశపెట్టి, రక్తనాళాల మార్గంలో కాలేయంలోని క్యాన్సర్ కణితికి రక్తాన్ని అందించే ధమని వరకు తీసుకెళ్లారు. అనంతరం కీమోథెరపీ మందులను నేరుగా కణితికి చేరేలా అందించారు. దీంతో శరీరంలోని ఇతర భాగాలకు మందుల ప్రభావం తక్కువగా ఉండేలా చూసి, కణితిపై స్థానికంగా చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది. ప్రక్రియ అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అనంతరం డిశ్చార్జ్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని కీమోథెరపీలు అవసరం ఉండనున్నాయి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రోగికి సూచించామని తెలిపారు. 

కాలేయ క్యాన్సర్ ప్రతి రోగిలో ఒకే విధంగా ఉండదని, కణితి పరిమాణం, వ్యాప్తి, కాలేయ పనితీరు, రోగి మొత్తం ఆరోగ్య పరిస్థితి ఆధారంగా చికిత్స విధానాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స సాధ్యం కాని రోగులకు టిఏసిఈ వంటి ఇంటర్వెన్షనల్ విధానాలు చికిత్సలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అయితే క్యాన్సర్ వచ్చిన ప్రతీ రోగికి ఈ పక్రియ సాధ్యం కాకపోవచ్చన్నారు. కాలేయంలో కణితి లేదా అనుమానాస్పద లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.