BREAKING
నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు సాంకేతిక లోపంతో ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం: ప్రయాణికులు సురక్షితం యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ 'జోన్-6'కి కమీషన్ల కక్కుర్తి! పశ్చిమ బెంగాల్‌లో మత విద్వేషాల కుట్ర కేసు: ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్‌కు పోలీసుల సమన్లు చెస్ ఒలింపియాడ్: భారత్ జోరు.. స్పెయిన్‌పై 3-1 తేడాతో పురుషుల జట్టు ఘన విజయం చిన్న శ్రీను పెద్ద కథే! విదేశాల్లో ఘనంగా ‘సేవా పఖ్వాడా’ పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్: 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు

Select Suryaa Now
నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు

కేజీబీవీలో అర్ధరాత్రి కలకలం..!!

నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు..!!

సీసీ కెమెరాల్లోనూ చిక్కని ఘటన..!!

రంగంలోకి పోలీసులు, బాలల హక్కుల కమిటీ..!!

భీమిలి,సెప్టెంబర్ 19, మేజర్ న్యూస్:

విద్యార్థినుల భద్రతకు పటిష్టమైన ఏర్పాట్లు ఉండాల్సిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. భీమిలి కృష్ణా కాలనీలో ఉన్నటువంటి కేజీబీవీ హాస్టల్‌లో నిద్రిస్తున్న బాలికల జడలను గుర్తుతెలియని వ్యక్తులు కత్తిరించడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 16వ తేదీ రాత్రి జరిగిన ఈ ఘటనలో మొత్తం 10 మంది బాలికల జడలు కత్తిరించబడినట్లు సమాచారం. 9వ తరగతికి చెందిన 20 మంది విద్యార్థినులు ఒక గదిలో నిద్రిస్తుండగా ఆరుగురి జడలు కత్తిరించారు. మరో గదిలో నిద్రిస్తున్న 18 మంది విద్యార్థినుల్లో నలుగురి జడలు కత్తిరించినట్లు తెలిసింది. తెల్లవారుజామున నిద్రలేచిన విద్యార్థినులు ఈ విషయాన్ని గుర్తించి పాఠశాల ప్రిన్సిపాల్ గంగాకుమారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదని ప్రిన్సిపాల్ తెలిపినట్లు సమాచారం. దీంతో బాలికల గదుల్లోకి గుర్తుతెలియని వ్యక్తులు ఎలా ప్రవేశించారు? ఘటన ఎలా జరిగింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా బాలల అభివృద్ధి అధికారి శ్రీదేవి, భీమిలి ఎస్‌ఐ గౌరీ వేర్వేరుగా విచారణ చేపట్టారు. విద్యార్థినులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. పోలీసులు, బాలల హక్కుల కమిటీ కూడా విచారణ కొనసాగిస్తున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను తెలుసుకునేందుకు ఆదివారం తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థినులను విచారించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.