BREAKING
నిద్రలో ఉన్న 10 మంది బాలికల జడలు కత్తిరింపు సాంకేతిక లోపంతో ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం: ప్రయాణికులు సురక్షితం యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు గాజుల గణపతి ముసుగులో రాక్షస దందా.. జీవీఎంసీ 'జోన్-6'కి కమీషన్ల కక్కుర్తి! పశ్చిమ బెంగాల్‌లో మత విద్వేషాల కుట్ర కేసు: ఏజేయూపీ అధినేత హుమాయున్ కబీర్‌కు పోలీసుల సమన్లు చెస్ ఒలింపియాడ్: భారత్ జోరు.. స్పెయిన్‌పై 3-1 తేడాతో పురుషుల జట్టు ఘన విజయం చిన్న శ్రీను పెద్ద కథే! విదేశాల్లో ఘనంగా ‘సేవా పఖ్వాడా’ పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌లో భారీ ఎన్‌కౌంటర్: 11 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా నంద్యాలలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండి ఫరూక్ డివైడర్ను ఢీకొన్న కారు బోల్తా ముగ్గురికి గాయాలు కునాల్ ఖేము ‘వైబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ. 2.25 కోట్ల వసూళ్లు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే శిల్పులు: ఘనంగా బీఎస్ఎంఏటీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం తల్లిదండ్రులైన దీపికా పదుకొనే, రవీర్ సింగ్.. రెండవ కూతురికి స్వాగతం పలికిన స్టార్ కపుల్ రేపు ఇరిగినేని తిరుపతి నాయుడు 88వ జయంతి

యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు

Select Suryaa Now
యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు

యాదాల సాయికిరణ్ జోరుతో టీడీపీలోకి భారీ చేరికలు

- వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి నాయకులు, కార్యకర్తలు

- నేడు పామూరులో భారీ చేరికల కార్యక్రమం

- ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు

- సాయికిరణ్ ఆధ్వర్యంలో చేరికలకు సర్వం సిద్ధం

పామూరు, మేజర్ న్యూస్ : పామూరు గ్రామ పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ యాదాల వెంకట సాయికిరణ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పామూరులోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో భారీ చేరికల కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీలో చేరే వారికి టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు. సాయికిరణ్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరనుండటంతో పామూరులో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై చేరికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదాల వెంకట సాయికిరణ్ కోరారు.