గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి
గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి
తీవ్ర తాగునీటి సమస్యతో గిరిజనులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోని ప్రభుత్వం
DTWO శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించిన శివకుమార్ నాయక్ GVSS రాష్ట్ర అధ్యక్షులు
భారతదేశంలోని అత్యంత కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాల్లో తాగడానికి మంచినీరు లేక చాలా దుర్భర పరిస్థితి గడుపుతున్నారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తాగడానికి నీళ్లు కావాలంటే 2,3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బోరు బావుల్లో నీరు తెచ్చుకొని తాగవలసిన పరిస్థితి ఏర్పడింది రైతుల పరిస్థితి అయితే మరున్ని దారుణంగా ఉంది ప్రభుత్వం పేరుకే చెప్పుకోవడానికి ప్రాజెక్టులు గాని ప్రాజెక్టులు వలన ఇప్పటివరకు డ్యాములు చెరువులు నింపకపోవడం దారుణం పరిస్థితి మరింత విషమించకుండా తక్షణం ప్రభుత్వం తాగునీటి సమస్య తీర్చేపల్లిలో ఉండాలని జిల్లా యంత్రాంగం గిరిజన గ్రామాలపై శ్రద్ధ చూపి తక్షణం గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించేలా చూడాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు రాజ్ కుమార్ నాయక్ ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు