ఆయుష్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి...
ఆయుష్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి...
- డా. విమల ప్రియదర్శినీ
- పెళ్ళూరులో యునాని వైద్య శిబిరానికి విశేష స్పందన
కోటి, సూర్య, ఒంగోలు రిపోర్టర్ : ఆయుష్ సేవలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోని వైద్య సేవలు పొందాలని యునాని వైద్యురాలు డా. విమల ప్రియ దర్శిని ప్రజలకు సూచించారు. ఒంగోలు నగర పరిధిలోని పెళ్ళూరు గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యునాని వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి వైద్య సేవలు పొందారు. డాక్టర్ విమల ప్రియ దర్శిని వారికి వైద్య సేవలతో పాటు ఆరోగ్య సూచనలు చేసిన మందులను అందజేశారు. ఈ సందర్భంగా డా. విమల ప్రియదర్శినీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సంప్రదాయ వైద్య సేవలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ కమిషనర్ ఆదేశాలతో యునాని వైద్యం ప్రజల్లోకి విస్తృతంగా ||తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులు మనిషిలో ఉన్న రుగ్మతులపై పని చేస్తాయని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కీళ్ళు, ఒళ్ళు నొప్పులు, జ్వరం, దగ్గు, బలం, మహిళల్లో అంతర్గత రుగ్మతులకు మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అరుణ, లక్ష్మీ, తదితరులు ఉన్నారు.