BREAKING
‘యాప్ గురించి తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇప్పియి’ వానలు పడాలని వేడుకుంటూ బతుకమ్మ ఆడిన మహిళలు సోమవారం పనాజీలో ‘వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్’ 28వ సమావేశం ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీలో తొలి ‘ఐబ్రిక్స్ సదస్సు 2026’ ఢిల్లీలో 116 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌కు రాష్ట్ర పురస్కారాలు పాట్నా గాంధీ ఘాట్ వద్ద 'గరిష్ట ప్రమాద స్థాయి' దాటి ప్రవహిస్తున్న గంగ 1,344కు చేరిన మృతుల సంఖ్య.. 4,900 మంది గల్లంతు వరద ముప్పులో వారణాసి శాస్త్రీయ దృక్పథం, ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దాలి ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌తో పట్టుబడిన కిడ్నాపర్.. మూడు నెలల తర్వాత గుంటూరు బాలిక రెస్క్యూ తెలంగాణలో దంచికొడుతున్న ఉక్కపోత - కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలకు అవకాశం! ఎయిర్ ఇండియా కీలక చర్య - డ్రగ్స్ పరీక్షలో విఫలమైన పైలట్ ఉద్యోగం రద్దు! భార్యాభర్తల గొడవల్లో పోలీసుల జోక్యం తగదు - ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు! ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) - క్లెయిమ్‌లు, అభ్యంతరాల కోసం నేడు, రేపు ప్రత్యేక ప్రచారం!

పాట్నా గాంధీ ఘాట్ వద్ద 'గరిష్ట ప్రమాద స్థాయి' దాటి ప్రవహిస్తున్న గంగ

Select Suryaa Now
పాట్నా గాంధీ ఘాట్ వద్ద 'గరిష్ట ప్రమాద స్థాయి' దాటి ప్రవహిస్తున్న గంగ

పాట్నా:బీహార్‌లో కురుస్తున్న కుండపోత వర్షాలకు గంగా నది ఉగ్రరూపం దాల్చింది. రాజధాని పాట్నాలోని గాంధీ ఘాట్ వద్ద శనివారం ఉదయం నది నీటిమట్టం గరిష్ట వరద స్థాయి (HFL) కంటే 1 సెం.మీ ఎత్తుకు చేరుకుని ప్రవహిస్తోంది. గత నాలుగు గంటల్లోనే నీటిమట్టం 10 సెం.మీ మేర పెరిగి 50.62 మీటర్లకు చేరడంతో పాట్నాలోని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని జలవనరుల శాఖ (WRD) హెచ్చరించింది. నదిలో నీటిమట్టం ఆదివారం ఉదయానికి మరింత పెరిగి కొత్త గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నదీ తీర ప్రాంత ప్రజలంతా తీవ్ర అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వరద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిరంతరం పర్యవేక్షించాలని, నది గట్ల వెంట ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా మేజిస్ట్రేట్లు (DM), ఎస్పీలను జలవనరుల శాఖ ఆదేశించింది. రాష్ట్రంతో పాటు పొరుగున ఉన్న నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల గంగ, కోసి, గండక్, బుర్హి గండక్, బాగ్మతి, పున్‌పున్, ఘఘ్రా నదులు ప్రమాదకర స్థాయికి పైగా ప్రవహిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో వైమానిక సర్వే నిర్వహించి సహాయక చర్యలను సమీక్షించారు.

బక్సర్ నుంచి భాగల్‌పూర్ వరకు గంగా నది గట్లు తెగిపోకుండా, కోతకు గురికాకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వరద పరిస్థితులు క్షణక్షణానికి తీవ్రమవుతుండటంతో యంత్రాంగం రక్షణ బృందాలను సిద్ధం చేసి సహాయక చర్యలను వేగవంతం చేసింది.