BREAKING
తీవ్ర సవాళ్లను దాటుకుని భారత్ నిలబడింది ఆయుష్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి... ‘యాప్ గురించి తెలియదు సారు.. నీ కాళ్లు మొక్కుతా యూరియా ఇప్పియి’ వానలు పడాలని వేడుకుంటూ బతుకమ్మ ఆడిన మహిళలు సోమవారం పనాజీలో ‘వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్’ 28వ సమావేశం ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి న్యూఢిల్లీలో తొలి ‘ఐబ్రిక్స్ సదస్సు 2026’ ఢిల్లీలో 116 మంది ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్‌కు రాష్ట్ర పురస్కారాలు పాట్నా గాంధీ ఘాట్ వద్ద 'గరిష్ట ప్రమాద స్థాయి' దాటి ప్రవహిస్తున్న గంగ 1,344కు చేరిన మృతుల సంఖ్య.. 4,900 మంది గల్లంతు వరద ముప్పులో వారణాసి శాస్త్రీయ దృక్పథం, ‘దేశమే ప్రథమం’ స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దాలి ఇన్‌స్టా మిస్డ్‌కాల్‌తో పట్టుబడిన కిడ్నాపర్.. మూడు నెలల తర్వాత గుంటూరు బాలిక రెస్క్యూ తెలంగాణలో దంచికొడుతున్న ఉక్కపోత - కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలకు అవకాశం! ఎయిర్ ఇండియా కీలక చర్య - డ్రగ్స్ పరీక్షలో విఫలమైన పైలట్ ఉద్యోగం రద్దు!

ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి

Select Suryaa Now
ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి

‘భారత్‌ను నైపుణ్య రాజధానిగా, జ్ఞాన సూపర్‌పవర్‌గా మార్చాలి’
న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ రాజధాని న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్య రాజధానిగా (Global Skill Capital), జ్ఞాన సూపర్‌పవర్‌గా (Knowledge Superpower) తీర్చిదిద్దడమే మన జాతీయ ప్రాధాన్యత అని పిలుపునిచ్చారు. రాజ్యాంగం అందించిన అవకాశాల సమానత్వ ఆదర్శాన్ని సాకారం చేయడానికి విద్యే అత్యంత ప్రభావవంతమైన సాధనమని ఆమె ఉద్ఘాటించారు.

ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటును దాదాపుగా శూన్యానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయుల కృషిని రాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల విద్య విద్యా వ్యవస్థకు పునాది అని, బాల్యంలో నేర్పే సత్ప్రవర్తన, నైతిక వికాసమే భవిష్యత్ తరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చే మొదటి తరం విద్యార్థులు, గ్రామీణ నేపథ్యం ఉన్న పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఉపాధ్యాయుల బాధ్యత అని స్పష్టం చేశారు.

ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ ద్వారానే 'వికసిత భారత్' కల సాకారమవుతుందని, దేశంలో ఒక్క విద్యార్థి కూడా నాణ్యమైన విద్యకు దూరం కాకూడదని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులే విద్యా వ్యవస్థకు జీవమని, తమ ఆప్యాయత, అంకితభావంతో విద్యార్థుల్లో జ్ఞానం, సృజనాత్మకత, నైతిక విలువలను పెంపొందించాలని రాష్ట్రపతి ముర్ము ఆకాంక్షించారు.