ఆత్మకూరు మండలంలో గాలివాన బీభత్సం
అనంతపురంబ్యూరో
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం సనప గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా నాకు గ్రామ శివారులో ఉన్న అరటి తోటలు పూర్తిగా గాలివానకు ఒరిగిపోయాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శుక్రవారం పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.