రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు స్వయంగా చర్యలు చేపట్టిన జిల్లా ఎస్పీ
సంగారెడ్డి, : గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సదాశివపేటలోని ఊబ చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్, నందికంది గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించారు.శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:15 గంటల సమయంలో సదాశివపేట మండలం నందికంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారి–65పై రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల పరిస్థితిని పరిశీలించి, వారికి అవసరమైన తక్షణ సహాయం అందించారు.
పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజల సహకారంతో క్షతగాత్రులను పోలీసు వాహనం, అంబులెన్స్ల ద్వారా చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా ఎస్పీ చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడిన వారు:
శివలీల, భర్త మల్లేశం, కంది గ్రామం, కంది మండలం.బి. సంతోష్, ఆటో డ్రైవర్, ఉత్తర్పల్లి గ్రామం, కొండాపూర్ మండలం.
ఎన్. అమర్, బీదర్ జిల్లా, బైక్ రైడర్.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.