పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్
పట్టుబడిన పిడిఎస్ బియ్యం డీసీఎం సీజ్
కొల్చారం …..పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న పిడిఎస్ బిఆర్ ని అక్రమంగా తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని కొల్చారం పోలీసులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొహీనుద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా కె ఏ-32-ఏ ఏ 4947 నెంబర్ గల డీసీఎం ఆఫీస్ తనిఖీ చేయగా ఫోర్టీ ఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్ ఆర్ కె) తో కలిపి 290 బస్తాల పిడిఎస్ బియ్యం, మొత్తం 143.10 క్వింటాళ్లు ఉన్నట్లు గుర్తించారు. వాహనం డ్రైవర్ ముజీబ్ ను విచారించగా చంద్రయనగుట్ట ప్రాంతంలోని రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు పిడిఎస్ బియ్యం కొనుగోలు చేసి, మెదక్ మీదుగా బోధన్ కు తరలించి అధిక ధరకు విక్రయించేందుకు తీసుకెళుతున్నట్లు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, డీసీఎం తనవేనని డ్రైవర్ చెప్పినట్లు తెలిపారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, తెలంగాణ స్టేట్ పీడీఎస్ కంట్రోల్ ఆర్డర్ ఆర్డర్-2016 లోని క్లాజ్ 17(ఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించగా నర్సాపూర్ మండలం లింగాపూర్ లోని తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ లో భద్రపరచినట్లు తెలిపారు. డీసీఎం వాహనాన్ని తదుపరి ఆదేశాల మేరకు కొల్చారం పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు ఎస్సై మహమ్మద్ ముహిముద్దీన్ తెలిపారు.