BREAKING
వినాయక మండపాలను సందర్శించిన ఆనంద గౌడ్ సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండండి పొలాలకు వెళ్లని వ్యవసాయ అధికారులు! రైతులకు అందని శాస్త్రీయ సాగు సూచనలు.. తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత - వ్యవసాయ రంగం ఆ తర్వాతేనని స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు నివాళులు అర్పించిన మిథున్ రెడ్డి *యూపీఐ చార్జీల నుంచి ఎరువులు, పురుగుమందులు, విత్తనాల డీలర్లకు మినహాయింపు ఇవ్వాలి గ్లోబల్ ఆడియెన్స్ కోసం నితీష్ తివారీ రామాయణ సరికొత్త ప్రయోగం - ఇంగ్లీష్ వెర్షన్‌లో సాంగ్స్ కట్, ముప్పై నిమిషాలు మదింపు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఎస్పీ తక్షణ సహాయం వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోస్టర్ ఆవిష్కరణ అర్బన్ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ని సత్కరించిన కార్మికులు* ధర్పల్లిలో వైద్య శిబిరం యూపీఐ పై తప్పుడు ప్రచారాలను నమ్మకండి: కిలారు దిలీప్ మున్సిపల్ సేవల ప్రైవేటీకరణను ఆపాలి

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి


01 సూర్య కరీంనగర్ ప్రతినిధి: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలు విడుదల చేయడం, 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు, ఈహెచ్‌ఎస్‌ను సమర్థంగా అమలు చేయడం, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించడం, జీవో 317 బాధితులను సొంత జిల్లాలకు సర్దుబాటు చేయడం, ఉద్యోగులు–రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించడం వంటి డిమాండ్లను సమావేశంలో తీర్మానించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి బానిసలు కాదని, పరిపాలనలో కీలక భాగస్వాములని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఉద్యోగ జేఏసీ చేపట్టే పోరాటానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.