వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ పోస్టర్ ఆవిష్కరణ
సూర్య కరీంనగర్ ప్రతినిధి :
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్–2027’ పోస్టర్ను ఆవిష్కరించారు. దేశ భవిష్యత్తును మార్చే ఆలోచనలు కలిగిన 15 నుంచి 29 ఏళ్ల యువతకు ప్రధాని నరేంద్ర మోదీని నేరుగా కలిసే అవకాశం కల్పించే ఈ కార్యక్రమంలో యువత పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి ఉన్న యువత mybharat.gov.in పోర్టల్లో సెప్టెంబర్ 30లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో మైభారత్ నమోదు ప్రక్రియలో ముందంజలో ఉండేందుకు కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, జిల్లా యువజన అధికారి గోలి తిరుపతిరెడ్డి, కార్యక్రమ అధికారి జి.కిరణ్ కుమార్, మైభారత్ వాలంటీర్ బకారం అక్షయ్ పాల్గొన్నారు