BREAKING
కొత్త కారు పూజలో ఊహించని విషాదం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద 68 ఏళ్ల వ్యక్తి మృతి! తెలంగాణ NEET విద్యార్థులకు బిగ్ అప్డేట్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు.. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 28 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు! ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేపాల్ వరదల్లో హైదరాబాద్ టెకీ మిస్సింగ్.. చివరి కాల్ తర్వాత కుటుంబంలో తీవ్ర ఆందోళన! సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలి సింగరేణి నుంచి బంగారు వేటకు బిగ్ ప్లాన్.. హట్టి గోల్డ్ మైన్స్‌తో జాయింట్ వెంచర్‌పై ఫోకస్! LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు క్రీడలతో మానసిక ఉల్లాసం.. శారీరక దారుఢ్యం

వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి.

Select Suryaa Now
వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి.

వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి.
నందగోకుల్‌ నుంచి చెల్మెడ కమాన్‌ వరకు 8 కి.మీ. పాదయాత్ర

రామాయంపేట, మేజర్ న్యూస్..: నందగోకుల్‌–నస్కల్‌–చెల్మెడ కమాన్‌ రహదారి పనులు నిలిచిపోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నేతృత్వంలో శనివారం భారీ పాదయాత్ర నిర్వహించారు. నందగోకుల్‌ నుంచి చెల్మెడ కమాన్‌ వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రహదారి పనులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైనా, బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలని, లేకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రహదారి పూర్తయ్యే వరకు ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారి పనులను పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.