BREAKING
నాగార్జున 100వ సినిమాకు టైటిల్ ఫిక్స్.. బర్త్‌డే స్పెషల్‌గా ‘King100’ గ్లింప్స్‌తో బిగ్ ట్రీట్! కొత్త కారు పూజలో ఊహించని విషాదం.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద 68 ఏళ్ల వ్యక్తి మృతి! తెలంగాణ NEET విద్యార్థులకు బిగ్ అప్డేట్.. MBBS సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ షురూ! త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు.. వారం రోజుల్లో రోడ్డు పనులు ప్రారంభించాలి. నేపాల్ వరదల్లో చిక్కుకున్న 28 మంది ఏపీ యాత్రికులు సేఫ్.. ఊపిరి పీల్చుకున్న కుటుంబాలు! ఎస్‌ఐఆర్‌ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నేపాల్ వరదల్లో హైదరాబాద్ టెకీ మిస్సింగ్.. చివరి కాల్ తర్వాత కుటుంబంలో తీవ్ర ఆందోళన! సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేయాలి సింగరేణి నుంచి బంగారు వేటకు బిగ్ ప్లాన్.. హట్టి గోల్డ్ మైన్స్‌తో జాయింట్ వెంచర్‌పై ఫోకస్! LoC సమీపంలో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ శాతవాహన విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో MCAలో స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్‌లో సదరం శిబిరాలు

త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు..

Select Suryaa Now
త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు..

త్రిబుల్ ఆర్ భూసేకరణలో మెదక్ జిల్లా ఉత్తమ పనితీరు..

మెదక్, మేజర్ న్యూస్ ప్రతినిధి....రీజనల్ రింగ్ రోడ్  భూసేకరణలో మెదక్ జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి గంగాధర్ ఐఏఎస్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన రెవెన్యూ, నేషనల్ హైవే అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు.భూసేకరణ పురోగతిని అధికారులు వివరించారు. అవార్డు పాస్ అయిన భూముల వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి, రైతులకు పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని గంగాధర్ సూచించారు. ఇతర జిల్లాలతో పోలిస్తే మెదక్ జిల్లాలో భూసేకరణ మంచి పురోగతిలో ఉందని ప్రశంసించారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ భూసేకరణలో పారదర్శకత పాటిస్తూ, అవార్డు పాస్ అయిన భూములకు త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భూసేకరణ పూర్తయితే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణ పనులు వేగవంతమవుతాయని పేర్కొన్నారు.సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్, నేషనల్ హైవే పీడీ మాధవి, నర్సాపూర్, తూప్రాన్ ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.