BREAKING
నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి అవమానం. మహిళా MLAల పై పోలీసుల తీరు అమానుషం మమ్ముట్టి పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ పెట్రోల్–డీజిల్ ధరలు స్థిరం.. క్రూడ్ ఆయిల్‌పై అందరి చూపు! కేసీఆర్‌ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు ప్రతి ఎకరాకూ నీరు.. తెలుగుతల్లికి జలహారతి తెలుగు సినీ సంగీత చక్రవర్తి 90 వ జయంతి మ్యాట్రీమోనీ మోసాలు.. ఇలాంటి వారికి డబ్బులు ఇస్తే నిండా మునిగినట్టే! వినాయక చవితి 2026 ఎప్పుడు? సెప్టెంబర్ 14నా, 15నా? పండితులు ఏం చెబుతున్నారు? తెలంగాణకు వర్ష సూచన.. కాసేపట్లో ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు! పోలీసు వ్యవస్థలో నూతన మార్పులు అవసరం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత హిజ్రాల పేరుతో వసూళ్లు.. హైదరాబాద్‌లో అక్రమ దందాపై పోలీసుల ఫోకస్!

నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు

Select Suryaa Now
నేతల అరెస్టులపై రోడ్డెక్కిన brs శ్రేణులు

నేతల అరెస్టుపై...
రోడ్డెక్కిన బిఆర్ఎస్ శ్రేణులు

చేవెళ్లలో బీజాపూర్ రహదారిపై బైఠాయింపు –

చేవెళ్ల,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 7):  రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసనకు దిగాయి. తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో మాజీ మంత్రులు కె.టి.రామారావు, తన్నీరు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో బీజాపూర్ ప్రధాన రహదారిపై పార్టీ కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు.

మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, విభిన్న స్వరాలను అణిచివేయడం తగదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలన అవినీతిపరమైందని విమర్శించారు. గులాబీ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అలాగే అసెంబ్లీ సమావేశాలను 30 రోజుల పాటు పొడిగించి, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నేతలు, మున్సిపాలిటీ పరిధిలోని కార్యకర్తలు  పాల్గొన్నారు