అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుర్మార్ఘం
కన్నీళ్లు పెట్టుకున్న సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు నిరసనగా ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు తీవ్ర అనాగరికంగా, అవమానకరంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
అసెంబ్లీ వద్ద నిరసన తెలుపుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఆమె చీర పట్టుకుని లాగుతూ దౌర్జన్యానికి దిగారని నేతలు తెలిపారు. ప్రజాప్రతినిధులని, కనీసం మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపై సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర మనస్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఈ రకమైన అణచివేత చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.