BREAKING
నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామన్న కేటీఆర్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన అల్కరాజ్ కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన సెగ.. నల్ల చొక్కాలతో అసెంబ్లీకి హాజరైన ప్రతిపక్ష సభ్యులు జిల్లా ఆసుపత్రిలో ఘనంగా గణపతి కర్ర పూజ చమురు ధరల మంట బిగ్ బాస్ తెలుగుకు నాగార్జున కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. పది కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్లకు చేరిన కింగ్ పారితోషికం ఏపీలో పోలీస్ అధికారి దురుసు ప్రవర్తన.. వృద్ధురాలిపై బూతులతో విరుచుకుపడ్డ వీడియో వైరల్.. సస్పెండ్ చేయాలని ప్రజాగ్రహం శ్రీవారిమెట్టు మార్గంలో కారు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న వాహనం.. హైదరాబాద్ యాత్రికులకు తప్పిన పెను ముప్పు తిరుపతిలో రౌడీషీటర్ వీరంగం.. హారన్ కొట్టాడని ట్రావెల్స్ మేనేజర్‌పై దాడి.. ఫోన్ ధ్వంసం చేసి బంగారు చైన్ చోరీ ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ.. బస్సులో మర్చిపోయిన రూ. 3 లక్షల నగదును ప్రయాణికుడికి అప్పగించిన కండక్టర్, డ్రైవర్ సూర్యాపేటలో సంచలనం.. వివాహితతో అక్రమ సంబంధం, భర్త హత్యకు కుట్ర ఆరోపణలు.. ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్‌పై చర్యలకు బాధితుడి ఆందోళన వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం.. రిపోర్టులు లేవంటూ గర్భిణికి నిరాకరణ.. అంబులెన్స్‌లోనే ప్రసవం నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించి సభకు వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు అనుష్క సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తున్నారా? లేడీ సూపర్‌స్టార్ మౌనం వెనుక అసలు నిజం ఏంటి? భోగాపురంలో అమానుషం.. బైక్ రిపేర్ డబ్బుల కోసం యువకుడి మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్లిన వైనం.. ఐదుగురు అరెస్ట్

నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామన్న కేటీఆర్

Select Suryaa Now
నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తామన్న కేటీఆర్

సూర్య అసెంబ్లీ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చ జరిగేందుకు వీలుగా శాసనసభ సమావేశాలను కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏదో తూతూమంత్రంగా రెండు మూడు రోజులు సభను నిర్వహించి చేతులు దులుపుకునే ధోరణిని ప్రతిపక్షంగా తాము ఎంతమాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో ఎన్నో కీలకమైన ప్రజా సమస్యలు పేరుకుపోయాయని, వాటన్నింటిపై విస్తృతంగా చర్చించి పరిష్కారాలు కనుగొనే విధంగా గౌరవ శాసనసభ స్పీకర్ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన అభద్రతాభావంలో కొట్టుమిట్టాడుతున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఏడు డీఏలు పెండింగ్‌లో పెట్టడంతో ఉద్యోగ సంఘాలు రోడ్లపైకి వచ్చి ఉద్యమ బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. సర్వీసు ముగించుకుని విశ్రాంతి జీవితం గడుపుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు నెలల తరబడి రావాల్సిన బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారందరి తరఫున సభలో గట్టిగా గొంతు విప్పుతామని తేల్చిచెప్పారు. 

ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఎండగడతామని పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో 22ఏ నిషేధిత భూముల పేరిట పెద్ద ఎత్తున అక్రమాలు మరియు అవినీతి దందా జరుగుతోందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 22ఏ భూముల వ్యవహారంలో జరుగుతున్న భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని హెచ్చరించారు. రైతాంగ సమస్యలు, రుణమాఫీ వైఫల్యాలు, గురుకులాల దుస్థితితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై సభలో నిలదీసి ప్రభుత్వాన్ని ప్రజల ముందు బోనులో నిలబెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.