బిజెపి నాయకుల అరెస్ట్.
బిజెపి నాయకుల అరెస్ట్.
వట్టిపల్లి. …. వట్టిపల్లి మండలంలో బిజెపి నాయకులను సోమవారం నాడు వట్టిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల ఫీజు బకాయిలను అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ( చలో అసెంబ్లీ) కార్యక్రమానికి వెళ్ళుతున్న అసెంబ్లీ కన్వీనర్ ఎం చంద్రశేఖర్. సురేష్ గౌడ్ .యాదయ్య. వెంకట్రావు .సంగమేశ్వర్. మొదలగు వారిని అరెస్టు చేయడం తగిన పద్ధతి కాదు అన్నారు. ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ! ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉందని ,ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని, బిజెపి నాయకుల గొంతు నొక్క ప్రయత్నం చేయడంతో, ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు. ప్రజల సమస్యలు ప్రశ్నిస్తే నిర్బంధిస్తారా? అని ప్రశ్నించారు. పోరాటం ఆగదు. ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.