రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం
రుస్తుంపేట్ గ్రామంలో పీఆర్ఏ కార్యక్రమం
నర్సాపూర్ ;
మండల పరిధిలోనీ రుస్తుంపేట్ గ్రామంలో మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు సోమవారం పీఆర్ఏ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్థుల భాగస్వామ్యంతో గ్రామ పటాన్ని రూపొందించి, పాఠశాల, అంగన్వాడీ, పంచాయతీ, దేవాలయం, నీటి వనరులు తదితర సామాజిక సంస్థలను గుర్తించారు. అలాగే గ్రామంలోని వివిధ నేల రకాలను చార్ట్ వేసి, సాగు చేస్తున్న వివిధ పంటలను బార్ గ్రాఫ్ ద్వారా ప్రదర్శించారు. అలాగే సమస్యా వృక్షం రూపొందించి, గ్రామంలోని సమస్యలను నమోదు చేసి, వాటికి తగిన పరిష్కారాలను సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ వనరులు, వ్యవసాయ పరిస్థితులు మరియు గ్రామాభివృద్ధి అంశాలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.