BREAKING
జోధ్‌పూర్‌లో భారత్, జపాన్ ‘వీర్ గార్డియన్-2026’ వైమానిక విన్యాసాలు సింగిల్ పీస్ డెంటల్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేసిన నిపుణులు కొలంబోలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఘన స్వాగతం జమ్మూ కాశ్మీర్‌లో కైలాష్ కుండ్ యాత్ర ప్రారంభం జాతీయ ఐక్యతను బలోపేతం చేయడంలో సైనిక్ పాఠశాలల కీలక పాత్ర డ్రోన్, కౌంటర్-డ్రోన్ టెక్నాలజీలను ప్రదర్శించనున్న ఐఏఎఫ్ ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ సినిమాను కుటుంబ ప్రేక్షకులు కూడా చూడొచ్చు.. ‘కడలి’ పాత్ర ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది: కథానాయిక వైష్ణవి చైతన్య ఎఫ్‌ఆర్‌ఐతో రూ. 5,000 కోట్లకు పైగా సైబర్ మోసాల నివారణ ఆహార ధాన్యాల నిర్వహణ ఆధునీకరణకు డీఎఫ్‌పీడీ, ఎఫ్‌సీఐ ఒప్పందం ఎఫ్‌టీ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్స్ యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ల ముసాయిదా చట్టంపై సూచనల గడువు పొడిగింపు అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే? వచ్చే ఏడాది మే-జూన్ నాటికి భారత బుల్లెట్ రైలు పరీక్షలు

యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్

Select Suryaa Now
యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్

పరీక్షా కేంద్రాలకు త్వరగా చేరుకోవాలని ఎన్టీఏ సూచన
న్యూఢిల్లీ: రాజధానిలో జరగనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు, భద్రతా కారణాల దృష్ట్యా విధించిన ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే యూజీసీ నెట్ పునఃపరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే బయలుదేరాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సూచించింది. భారత్ మండపంలో జరగనున్న అంతర్జాతీయ ప్రముఖుల రాకపోకల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారని, దీనివల్ల ప్రయాణంలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో రాకపోకలు సాగించాలని స్పష్టం చేసింది.

జూన్ 2026 యూజీసీ నెట్ పరీక్షలో చోటుచేసుకున్న లోపాల కారణంగా ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు పునఃపరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ తెలిపింది. సెప్టెంబర్ 9న ఉదయం ఇంగ్లీష్, మధ్యాహ్నం కామర్స్ పరీక్షలు జరగనుండగా.. సెప్టెంబర్ 10న ఉదయం సోషియాలజీ పరీక్ష జరగనుంది. సకాలంలో కేంద్రాలకు చేరుకుని ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.