BREAKING
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేడి: ఈ నెల 16న రాజకీయ పార్టీలతో ఈసీ కీలక భేటీ! దేశీ గోవుల పరిరక్షణే లక్ష్యం 100 దేశీ ఆవుల సంరక్షణకు డాక్టర్‌ ఆర్ఎస్ఎస్‌ దేశీ గోశాల కార్యాచరణ బిగ్‌బాస్ 10 తెలుగు: హైరిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్.. ఎలిమినేషన్ టెన్షన్ షురూ! 'దృశ్యం 3' ట్రైలర్ వచ్చేసింది: అజయ్ దేవ్‌గణ్‌ సస్పెన్స్ థ్రిల్లర్ మరోసారి అదుర్స్! భారత్‌లో అత్యంత శక్తివంతమైన మిస్సైల్ ఏదో తెలుసా? నిమిషాల్లో శత్రు దేశాలను బూడిద చేసే ఆయుధం ఇదే! ఓలీ రాబిన్సన్ అరుదైన ప్రపంచ రికార్డు: శతాబ్దపు అత్యుత్తమ బౌలింగ్ సగటు నమోదు! భారీ బడ్జెట్‌తో 'మహేంద్రగిరి వారాహి': గొప్ప డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ ఇవ్వబోతున్నాం - నిర్మాత మధు కలిపు రూరల్ బ్యాంకుల్లో 13,706 ఉద్యోగాలకు దరఖాస్తులు షురూ: ఈ నెల 21 లోగా అప్లై చేయండి! హైదరాబాద్‌లో డెలివరీ బాయ్స్‌కు ప్రభుత్వం గుడ్‌న్యూస్: 'ప్రగతి కేంద్రాల' ఏర్పాటు! రణబాలి టీజర్ వచ్చేసింది: విజయ్-రష్మిక మాస్ యాక్షన్ అదుర్స్! ఆహార వైవిధ్యం, ప్రోటీన్ లభ్యతపై దృష్టితో 'రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2026' ప్రారంభం యూపీఐ నుండి ప్రపంచ నాయకత్వం వరకు హరిత హైడ్రోజన్ ఉత్పత్తికి కొత్త దారి డీయూఎస్‌యూ ఎన్నికల నామినేషన్లు భారతదేశ భవిష్యత్తు నిర్మాణంలో గిరిజన సమాజాలు భాగస్వాములు

వచ్చే ఏడాది మే-జూన్ నాటికి భారత బుల్లెట్ రైలు పరీక్షలు

Select Suryaa Now
వచ్చే ఏడాది మే-జూన్ నాటికి భారత బుల్లెట్ రైలు పరీక్షలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
వడోదర: భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన మొట్టమొదటి బుల్లెట్ రైలు పరీక్షలు వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి ప్రారంభమవుతాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పరీక్షలు పూర్తయిన రెండు నుంచి నాలుగు నెలల వ్యవధిలోనే ఈ రైలును అధికారికంగా ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. వడోదరలో నిర్వహించిన ‘నమో ఫర్ విక్సిత్ భారత్’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, బుల్లెట్ రైలుకు సంబంధించిన మొదటి బాడీ ఫ్రేమ్‌ నిర్మాణం పూర్తయిందని, ప్రస్తుతం దానిని స్క్వీజ్ టెస్ట్ కోసం పంపినట్లు పేర్కొన్నారు.

‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ రైలు అందుబాటులోకి వస్తే వడోదర - ముంబై మధ్య ప్రయాణ సమయం కేవలం 90 నిమిషాలకు తగ్గుతుందని ఆయన చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్టులో కీలకమైన సూరత్ - వాపి సెక్షన్ నిర్మాణం ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తవుతుందని స్పష్టం చేశారు.

కేవలం బుల్లెట్ రైలే కాకుండా భారతీయ రైల్వేను సమగ్రంగా ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఆపరేటింగ్, రిజర్వేషన్ వ్యవస్థల ఆధునీకరణతో పాటు సరుకు రవాణా కోసం కొత్త డిజైన్ వ్యాగన్లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 280 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, 36,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌ల నిర్మాణం పూర్తయ్యాయని, చెనాబ్ వంతెన, మిజోరాం రైల్వే కనెక్టివిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు.