BREAKING
"నన్ను సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారు".. కొండా సురేఖ సంచలన ఆరోపణలు! శాంతి ఒప్పందానికి అవకాశం ఉంది...కానీ కీవ్ వైఖరితోనే చిక్కులు ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్ 2026 వారంలో ఒకసారి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయాలి భారత్-సెయిషెల్స్ బంధం మరింత బలోపేతం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు.. కేబినెట్ ప్రక్షాళన మరియు నామినేటెడ్ పదవుల్లో కీలక మార్పులు భారత ఎఫ్‌టీఏల వినియోగంపై దేశవ్యాప్త ప్రచారం దుద్దెడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూరోద్దీన్ భారత్–బెల్జియం వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వజ్రాల నుంచి రక్షణ రంగానికి భారత్-బెల్జియం బంధం చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్..క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన శ్రీకాంత్ 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' ఖరారు: మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అప్‌డేట్స్‌తో నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ భారీ వర్షాలకు కుంగిన పట్టాలు ఢిల్లీలో 50 కొత్త ఈ-బస్సులు, ఆటోమేటెడ్ వాహన పరీక్షా కేంద్రం ప్రారంభం కీలక బిల్లును ఆమోదించిన గోవా అసెంబ్లీ

భారీ వర్షాలకు కుంగిన పట్టాలు

Select Suryaa Now
భారీ వర్షాలకు కుంగిన పట్టాలు

హౌరా-మాల్దా డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు ఆటంకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు రైల్వే పరిధిలో ఉన్న హౌరా-మాల్దా డివిజన్‌లో భారీ వర్షాల కారణంగా రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో గురువారం పలు రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్థరాత్రి దాటాక 2 గంటల ప్రాంతంలో టిల్‌పారా – న్యూ ఫరక్కా స్టేషన్ల మధ్య అప్ లైన్ పట్టాల కింద నేల మెత్తబడి మట్టి కోతకు గురైనట్లు అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం వల్ల ఉత్తర, దక్షిణ బెంగాల్ ప్రాంతాల మధ్య నడిచే ప్రధాన రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. ఉదయం నుంచి ఉత్తర బెంగాల్ వైపు వెళ్లే అప్ లైన్ రైళ్లను ప్రత్యామ్నాయ బైపాస్ లైన్ ద్వారా మళ్లించి నడుపుతున్నారు. న్యూ ఫరక్కా వైపు వచ్చే డౌన్ లైన్ రైళ్ల రాకపోకలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే సీనియర్ రైల్వే అధికారులు, ఇంజనీరింగ్ నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ట్రాక్ దెబ్బతినడంతో జోగ్‌బానీ ఎక్స్‌ప్రెస్, గౌర్ ఎక్స్‌ప్రెస్, డార్జిలింగ్ మెయిల్ వంటి పలు దూరప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగానే నేల కుంగిపోయి మట్టి కొట్టుకుపోయిందని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు త్వరలోనే మార్గాన్ని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.