BREAKING
విద్యుత్ బకాయిల వివాదానికి ముగింపు: టీజీఈఆర్సీ కీలక నిర్ణయం "నన్ను సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ చేశారు".. కొండా సురేఖ సంచలన ఆరోపణలు! శాంతి ఒప్పందానికి అవకాశం ఉంది...కానీ కీవ్ వైఖరితోనే చిక్కులు ఏహెచ్ఎఫ్ జూనియర్ ఆసియా కప్ 2026 వారంలో ఒకసారి ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేయాలి భారత్-సెయిషెల్స్ బంధం మరింత బలోపేతం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు.. కేబినెట్ ప్రక్షాళన మరియు నామినేటెడ్ పదవుల్లో కీలక మార్పులు భారత ఎఫ్‌టీఏల వినియోగంపై దేశవ్యాప్త ప్రచారం దుద్దెడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూరోద్దీన్ భారత్–బెల్జియం వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వజ్రాల నుంచి రక్షణ రంగానికి భారత్-బెల్జియం బంధం చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్..క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన శ్రీకాంత్ 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026' ఖరారు: మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ అప్‌డేట్స్‌తో నేటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ భారీ వర్షాలకు కుంగిన పట్టాలు ఢిల్లీలో 50 కొత్త ఈ-బస్సులు, ఆటోమేటెడ్ వాహన పరీక్షా కేంద్రం ప్రారంభం

భారత్-సెయిషెల్స్ బంధం మరింత బలోపేతం

Select Suryaa Now
భారత్-సెయిషెల్స్ బంధం మరింత బలోపేతం

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌తో సెయిషెల్స్ పార్లమెంటరీ బృందం భేటీ
న్యూఢిల్లీ: భారత్, సెయిషెల్స్ దేశాల మధ్య ఉన్న చిరకాల ద్వైపాక్షిక, పార్లమెంటరీ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గురువారం పార్లమెంట్ భవనంలో సెయిషెల్స్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నెస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు.

సెయిషెల్స్ జాతీయ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికైన ఎర్నెస్టాకు ఉపరాష్ట్రపతి అభినందనలు తెలపడంతో పాటు, ఆ దేశ స్వాతంత్ర్య 50వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందించారు. 2026 సంవత్సరం భారత్-సెయిషెల్స్ దౌత్య సంబంధాల 50వ వార్షికోత్సవ సంవత్సరమని, ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి పర్యటనలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేశాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

సెయిషెల్స్ అభివృద్ధి, భద్రతా అవసరాల కోసం ఫిబ్రవరిలో భారత్ ప్రకటించిన 175 మిలియన్ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. భారత పార్లమెంట్‌లో అమలు చేస్తున్న కాగితరహిత (పేపర్‌లెస్) కార్యకలాపాలు, డిజిటల్ ఆర్కైవ్స్, ఏకకాల అనువాదం, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక విధానాలను అధ్యయన పర్యటనలు, శిక్షణా కార్యక్రమాల ద్వారా సెయిషెల్స్ అసెంబ్లీతో పంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు.

సెయిషెల్స్‌లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తమిళ, గుజరాతీ వర్గాలు ఇరు దేశాల మధ్య బలమైన సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నారని కొనియాడారు. స్పీకర్ ఎర్నెస్టా క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం భారత్-సెయిషెల్స్ ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పార్లమెంటరీ బృందం పర్యటన ఇరు దేశాల ప్రాతినిధ్య సంస్థల మధ్య సహకారానికి సరికొత్త ఊపునిస్తుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు.