నందిపాడు కాలనీ సమీపంలో గుర్తు తెలియని శవం కలకలం: పంచాయతీ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
కడప–కర్నూల్ జాతీయ రహదారిపై నందిపాడు కాలనీ వద్ద గుర్తు తెలియని శవం కలకలం రేపింది.
గ్రామస్తులు సమాచారం అందించగా ఖాజీపేట పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
పంచాయతీ అధికారులకు పోలీసులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదని తెలుస్తోంది.
స్థానికుల్లో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.