కానూరులో ఘనంగా సహస్ర గరికార్చన..
*గణపతి నామస్మరణతో మార్మోగిన ఆలయం”
పెరవలి మేజర్ న్యూస్ : తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు గ్రామంలోని వినాయక ఆలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం దూర్వాష్టమి సందర్భంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గణపతికి అత్యంత విశిష్టమైన సహస్ర గరికార్చన నిర్వహించారు. స్వామివారికి వెయ్యి గరికలతో ప్రత్యేకంగా అర్చనలు చేసి పూజలు నిర్వహించారు.దూర్వాష్టమి రోజున గణపతికి గరికతో పూజ చేయడం విశేషంగా భావిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం గణపతి నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.గణపతి నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జంధ్యాల రాజా శర్మ మేజర్ న్యూస్ కు తెలియజేశారు.