BREAKING
సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కరువు చెట్లు పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ నందిపాడు కాలనీ సమీపంలో గుర్తు తెలియని శవం కలకలం: పంచాయతీ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన రవితేజ ‘ఇరుముడి’ సినిమా.. ‘యాలాలో యాలాలో’ వీడియో సాంగ్ విడుదల వినాయక చవితి వేడుకలకు సర్వం సిద్ధం చేసిన సైబరాబాద్ పోలీసులు.. పటిష్ట భద్రతతో పాటు విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి ముగిసిన బ్రిక్స్ సదస్సు.. స్వదేశాలకు పయనమైన వివిధ దేశాల అధినేతలు మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం .... ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి & మాజీ కార్పొరేటర్ బన్నాల గీత నాగోల్‌లో అంబరాన్ని అంటుతున్న గణేష్ ఉత్సవాలు.. 72 అడుగుల భారీ మట్టి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ తిరుమల వాహనాల అనుమతిపై వస్తున్న వార్తలు అవాస్తవం: టీటీడీ స్పష్టత ఎల్బీనగర్‌లో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అధికారుల చర్యలు ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణేష్ మండపాలను సందర్శించిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ గాంధీ ఆస్పత్రి వైద్యుల అరుదైన ప్రతిభ.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం బిగ్ బాస్ హౌస్‌లో దేబ్జానీ మనసులోని మాట.. ముఖేష్‌పై ప్రత్యేక ఇష్టం సిల్క్ సిటీ... గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత సిటీగా ఉండాలి* *పట్టణ ప్రజలకు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పిలుపు* ఇరుముడి’ విజయానందం.. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన చిత్ర యూనిట్ ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు* *సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా పరిటాల శ్రీరామ్* *87మందికి రూ.44 లక్షల చెక్కులు

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పనితీరుపై శ్వేత పత్రం విడుదల చేయాలి

Select Suryaa Now
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పనితీరుపై శ్వేత పత్రం విడుదల చేయాలి

 

ఎస్సీ వర్గాల సంక్షేమానికి ఏం చేశారు..? నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ...?

కమిషన్ల వ్యవహారంతోనే అభివృద్ధి పనులు నిలిచిపోయాయి
కాడ్లాపూర్ రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దారుణం
మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 13): కాడ్లాపూర్ రైతుల సమస్యలపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తీవ్రంగా స్పందించారు. రైతులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి వికారాబాద్‌కు తరలించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. రైతుల సమస్యలపై జిల్లా ఎస్పీని కలిసి అనంతరం మీడియాతో మాట్లాడారు.కాడ్లాపూర్‌కు చెందిన 14–15 మంది రైతులను అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేసి డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉంచారని, అక్కడ కనీసం తాగునీరు, ఆహారం కూడా అందుబాటులో లేకపోవడంతో రైతులు తమకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారని ఆయన తెలిపారు. రైతులను పరామర్శించేందుకు తాము బయలుదేరిన విషయం తెలుసుకుని వారిని మరో ప్రాంతానికి తరలించారని ఆరోపించారు.భూములు ఇవ్వబోమని చెప్పడం తప్ప రైతులు చేసిన తప్పేమిటని ఆనంద్ ప్రశ్నించారు. తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వబోమని ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేసిన రైతులను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఎస్పీని కోరినట్లు, దీనిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు.

స్పీకర్ పనితీరుపై ప్రజలకు సమాధానం చెప్పాలి

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఎస్సీ వర్గాల సంక్షేమం కోసం స్పీకర్‌గా ఏం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని ప్రశ్నించారు.వికారాబాద్‌లో పలు అభివృద్ధి పనులు నిలిచిపోవడానికి కమిషన్ల వ్యవహారమే కారణమని ఆనంద్ ఆరోపించారు. అభివృద్ధి పనుల పరిస్థితి, వాటి పురోగతి, నిధుల వినియోగంపై స్పీకర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు స్పీకర్ స్పందించాలని కోరారు.

మాట ఒకటి.. అసెంబ్లీలో చెప్పేది మరొకటా...?

గతంలో కాంగ్రెస్ నాయకులు రైతులకు భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారని, ఇప్పుడు అదే రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అసెంబ్లీలో చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆనంద్ ప్రశ్నించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.కాడ్లాపూర్ రైతుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెంటనే స్పందించాలని ఆనంద్ డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన ఒత్తిళ్లను నిలిపివేసి, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, గోపాల్, కౌన్సిలర్ల, నాయకులు ఉన్నారు.