BREAKING
2030 నాటికి ఏఐ వల్ల ప్రపంచ వినాశనం జరిగే అవకాశం సున్నా శాతం తమిళనాడులో విజృంభిస్తున్న డెంగ్యూ ఆసియా క్రీడల భారత పతాకధారిగా పవన్ సెహ్రావత్ రోజ్‌గార్ మేళాలో నేడు 51 వేలకు పైగా నియామక పత్రాల పంపిణీ పొంచి ఉన్న ప్రమాదం అట్టహాసంగా హతః సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్: ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ బ్యూటీ తనూజ బిగ్‌బాస్‌ హౌస్‌లో రసవత్తరంగా పదమూడో రోజు ఆట: తొలి కెప్టెన్‌గా రైతు బిడ్డ ఎంపిక కింద పడ్డ వినాయక విగ్రహం వెండి ధరలు నేడు ఎంత ఉన్నాయంటే.. తెలంగాణ, ఏపీలో తాజా రేట్లు ఇవే బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయా? తెలంగాణ, ఏపీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇదే జాతీయ పోషణ మాసంలో పాల్గొన్న సర్పంచ్ గుగులోతు ప్రేమ్ ప్రసాద్ హెచ్-1బి వీసాలపై $1,00,000 రుసుము పొడిగింపు గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా-డెన్మార్క్‌ చారిత్రాత్మక ఒప్పందం క్యూబాలో ఊహించని విపత్తు బాలింతలు, గర్భిణీ స్త్రీలు అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకోవాలి -అంగన్వాడి సూపర్వైజర్ కందుకూరి మంగమ్మ

గణనాథుని సన్నిధిలో ఘనంగా కుంకుమ అర్చన పూజలు

Select Suryaa Now
గణనాథుని సన్నిధిలో ఘనంగా కుంకుమ అర్చన పూజలు

తిరుమలగిరి మేజర్ న్యూs:- తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని  మల్లేశ్వరి థియేటర్ వీధిలో శ్రీ గణేష్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వినాయకుడి సన్నిధిలో శనివారం కుంకుమ అర్చన పూజా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, అధిక సంఖ్యలో పాల్గొని లోకకళ్యాణార్థం, కాలనీ ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మేడబోయిన పద్మ, బానోతు హీరోని, స్వాతి, స్వరూప, లక్ష్మి, యాకమ్మ, శోభ, రాధ, మల్లమ్మ, నవత, సుజాత, జ్యోతి, భీకి, మమత, పవిత్ర, మంజుల తదితరులు పాల్గొన్నారు.