పురుషులకు దీటుగా పొలం పనుల్లో మహిళ
భుజాన పురుగుమందు ట్యాంక్.. చేతిలో పిచికారీ యంత్రం
బషీరాబాద్, మేజర్ న్యూస్ (ఆగస్టు 31):వ్యవసాయంలో మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ మహిళా రైతు. బషీరాబాద్ మండలంలోని ఓ పత్తి పొలంలో భుజాన బరువైన పురుగుమందు ట్యాంకును మోస్తూ, చేతిలో పిచికారీ యంత్రంతో పంటకు మందు పిచికారీ చేస్తూ కనిపించింది. కుటుంబ బాధ్యతలతో పాటు వ్యవసాయ పనుల్లోనూ పురుషులతో సమానంగా శ్రమిస్తూ మహిళలు కుటుంబ ఆర్థిక స్థితికి అండగా నిలుస్తున్నారనడానికి ఈ దృశ్యం ప్రతీకగా నిలిచింది.