అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా
అక్రమ నిర్మాణం పై సి ఎం సి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా
వైఎస్ ఆర్ కాలనీలో అనుమతులు లేకుండా నిర్మించిన స్లాబు కూల్చివేత
జిన్నారం :బొల్లారం డివిజన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో అనుమతులకు విరుద్ధంగా 75 గజాలలో అక్రమ నిర్మాణం పై సి ఎం సి అధికారులు కోరాడ జులిపించారు.ఈ మేరకు సోమవారం సి ఎం సి కమిషనర్ సృజన, ఏసీ పి ప్రసాద్, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలతో ఏసీపి టౌన్ ప్లానింగ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది పెద్ద ఎత్తున కూల్చివేత నిర్వహించారు. అనుమతులకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణం తొలగింపు చర్యలతో వైయస్సార్ కాలనీలో వాతావరణం వేడిగా మారింది. కార్యక్రమంలో సిబ్బంది వినయ్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.