టీచర్పై విద్యార్థినుల ఆరోపణలు?
టీచర్పై విద్యార్థినుల ఆరోపణలు?
పాపన్నపేట, ఆగస్టు 31:
పాపన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరిపై కొందరు విద్యార్థినులు అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. తమకు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు ఇతర ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అంతేకాకుండా బాలల హెల్ప్లైన్ 1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు నేపథ్యంలో మహిళా–శిశు సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే విచారణలో వెల్లడైన అంశాలు, నివేదిక ఎవరికి సమర్పించారన్న వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
విద్యార్థినుల ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని విద్యార్థి, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.