BREAKING
ఇస్రో మరో ఘనవిజయం: GSLV-F17 రాకెట్ ద్వారా నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన 'EOS-05' శాటిలైట్! శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నూతన సీఈఓగా ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం! హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ప్రతి పేదవాడికీ వైద్యం అందాలి లంకపోతు అంజిరెడ్డి నీ స్థాయేంటి...? నేపాల్ వరద బాధితులకు భారత్ చేయూత: మరో 21 టన్నుల అత్యవసర సహాయక సామగ్రిని పంపిన విమానాలు! ఆదిలాబాద్ వాగులో కోట్ల విలువైన రత్నాల నిధి.. 6.5 కోట్ల ఏళ్ల నాటి అద్భుతం! కార్ ప్రియులకు షాక్: సెప్టెంబర్ 1 నుంచి ప్రియమైన టాటా, హ్యుందాయ్ కార్ల ధరలు - రూ. 25,000 వరకు పెంపు! ఘనంగా సూర్య దినపత్రిక చైర్మన్ నూకారపు సూర్య ప్రకాష్ రావు జన్మదిన వేడుకలు మౌలి తనుజ్ ప్రశాంత్ 'దొంగ నా కొడుకు' - శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న క్రైమ్ కామెడీ మూవీ! ఇంటర్ విద్య జోలికొస్తే ఊరుకోం: సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. కొరివితో తలగోక్కున్నట్టేనని హెచ్చరిక! సూపర్ స్టార్ రజనీకాంత్ 'ధర్మన్' రెండో షెడ్యూల్ పూర్తి - 'ది డెడ్లీ డాక్టర్' ట్యాగ్‌లైన్‌తో అంచనాలు తారాస్థాయికి! నాణ్యతలో రాజీ వద్దు... పనులు పటిష్టంగా చేపట్టాలి స్వయంపాకం అంటే ఆకలి తీర్చడం కాదు.. పవిత్ర యజ్ఞం! విశ్వనాథ సత్యనారాయణ తత్వమిదే! తెరపై ఆయన విగ్రహం కనిపిస్తే చాలు.. ఎస్వీఆర్ నటనా వైదుష్యంపై ఎల్.వి. ప్రసాద్ చెప్పిన అద్భుత పాఠం!

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Select Suryaa Now
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి.

మాసాయిపేట ; హామీల అమలు లో ప్రభుత్వం విఫలమైందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, వెయ్యి రోజులు దాటినా హామీలలో మాత్రం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మాసాయిపేట  మండల కేంద్రంలో  ముఖ్యంగా పెన్షన్లపై సమరభేరి మోగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పంట పొలాలకు నిరందిస్తే, కాలేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తూ రైతులకు నీరు అందించడం లేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రూ. 200 ఉన్న పెన్షన్ ను రూ.2000 వేలకు పెంచారని  కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, రైతుబంధు, రైతు బీమా తదితర మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆడ పిల్ల పుడితే రూ. 13 వేలు, మెగా పిల్లాడు పుడితే రూ. 12 వేలు ఇచ్చారని, హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ.2500లు, పెన్షన్ లను రూ. 4 వేలకు పెంచుతామని, నిరుద్యోగ భృతి ఇస్తామని గద్దెనెక్కిన తర్వాత హామీలను విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మాసాయిపేట మాజీ సర్పంచులు నాగరాజు, మధుసూదన్ రెడ్డి, తూప్రాన్ మాజీ జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, శివ్వంపేట మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రా గౌడ్, నాయకులు రమణారెడ్డి, గొర్రె వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.