ఢిల్లీ భవనం కూలిపోవడం ఆరుకు పెరిగిన మృతుల సంఖ్య
ప్రాణనష్టం పట్ల ప్రధాని మోదీ సంతాపం.. మేజిస్ట్రేట్ విచారణకు సీఎం ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండవచ్చనే అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), అగ్నిమాపక సిబ్బంది మరియు ఢిల్లీ పోలీసులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 11 మందిని సురక్షితంగా వెలికితీయగా, బాధితుల్లో ఎక్కువమంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ పరిధిలో విద్యార్థుల పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహంగా ఉపయోగిస్తున్న ఈ 40-50 ఏళ్ల నాటి భవనం బేస్మెంట్లో మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. భవన యజమాని హరిరామ్పై సౌత్ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కాగా, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.