BREAKING
‘సర్దార్ 2’ మూవీ రివ్యూ.. కార్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా? 15,000 మంది సిబ్బంది 200 పారామిలిటరీ బలగాలతో ఢిల్లీలో భారీ భద్రత నెదర్లాండ్స్‌లో వెస్ట్ నైల్ వైరస్ వ్యాప్తి – ముగ్గురు మృతి శిశు గృహం, జువైనల్ జస్టిస్ బోర్డు, సఖి కేంద్రాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. యువరాజు రహీం అగా ఖాన్ V తో ప్రధాని మోదీ భేటీ బిగ్‌బాస్ హౌస్‌లో హైరిస్క్‌ టెన్షన్.. చైత్ర, షాలిని మధ్య మాటల యుద్ధం వరి ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు. మ్యూచువల్ ఫండ్లలోకి భారీగా పెట్టుబడులు వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం ఆయిల్‌పామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయి అవగాహన. భారత్-చైనా సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు బ్రిక్స్ సదస్సు ఒక వేదిక పండుగను సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలి నేపాల్ వరదల్లో 1,377కి పెరిగిన మృతుల సంఖ్య బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం

Select Suryaa Now
ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం

ఫెర్రీలో అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి, 80 మందికి పైగా గల్లంతు
మనీలా: పశ్చిమ ఫిలిప్పీన్స్‌లోని పలవాన్ ద్వీపం సమీపంలో ఒక ఫెర్రీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందగా, 80 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకున్నట్లు ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ (PCG) గురువారం వెల్లడించింది.

మనీలాలోని బేసెకో ప్రాంతం నుండి కొరోన్ వైపు వెళ్తున్న 'ఎంవి జూన్ ఆస్టర్' (MV June Aster) అనే ప్రయాణికుల నౌక పలవాన్‌లోని కొరోన్ సముద్ర జలాల్లోకి చేరుకోగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వేగంగా విస్తరించిన మంటలు నౌకలోని కొన్ని భాగాలను పూర్తిగా చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బుధవారం రాత్రి నాటికి 43 మందిని సురక్షితంగా రక్షించారు.

నౌకలోని ప్రయాణీకుల జాబితా ప్రకారం ఘటన సమయంలో మొత్తం 117 మంది ప్రయాణికులు, 17 మంది సిబ్బంది ఉన్నారని కోస్ట్ గార్డ్ ప్రతినిధి కమోడోర్ నోమీ కయాబ్యాబ్ తెలిపారు. ప్రస్తుతం బతికి బయటపడిన వారు, మరణించిన వారి గణాంకాల ఆధారంగా దాదాపు 80 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉందన్నారు. సముద్రంలో సహాయక, రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, బాధితుల సంఖ్య మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.