నిరుద్యోగులకు వైసీపీ అండ: జగన్
నిరుద్యోగ యువతపై కేసులు పెట్టడాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. కాకినాడలో పోలీస్ ఉద్యోగాల కోసం ఆందోళన చేసిన 20 మంది ఉద్యోగార్థులపై కేసులు పెట్టడంపై మండిపడ్డారు.
“బాబూ.. ఉద్యోగాలు ఎక్కడ? అని అడిగితే కేసులా?” అని ప్రశ్నించిన జగన్.. వెంటనే మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.
“నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ అండగా ఉంటుంది.. పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం” అని జగన్ స్పష్టం చేశారు.