BREAKING
ఏపీడబ్ల్యూజేఎఫ్ తొలి జిల్లా మహాసభలకు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఆహ్వానం APPSC నోటిఫికేషన్ విడుదల: వివిధ శాఖల్లో 892 ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే! మ్యూజికల్ లెజెండ్ బయోపిక్‌లో రష్మిక.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో నటి! 22ఏ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ధరణి, భూ భారతి అక్రమాలపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలి. భారత సంతతి శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం.. ఆర్థర్ ఎమ్. బ్యూచే అవార్డు ప్రకటన ఈనెల 19 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగు రాష్ట్రాల్లో 18-20 తేదీల్లో భారీ వర్షాలు: IMD వెల్లడి కొల్చారం గ్రామంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు: - ప్రధాన వీధులు, కాలనీల గుండా మందు పిచికారీ 2029 నాటికి 21 రాష్ట్రాల్లో 'యూసీసీ' అమలు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ సూరి నటనకు రజినీకాంత్ ఫిదా.. 'మండాడి' చిత్రానికి అరుదైన ప్రశంసలు కరువు కొరల్లో.. కర్నూలు .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు యూకేలో చీలికలు? స్వాతంత్య్రం దిశగా మూడు ప్రాంతాలు!* గుండెపోటుతో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత APPSC పోటీ పరీక్షల గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు.. ఉత్తర్వులు జారీ *వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి*

ఈనెల 19 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగు రాష్ట్రాల్లో 18-20 తేదీల్లో భారీ వర్షాలు: IMD వెల్లడి

Select Suryaa Now
ఈనెల 19 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం.. తెలుగు రాష్ట్రాల్లో 18-20 తేదీల్లో భారీ వర్షాలు: IMD వెల్లడి



 

ఈ నెల 19 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కానుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాల తిరోగమనం (Monsoon Withdrawal) ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. తొలుత వాయవ్య భారతంలోని పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్లడం ప్రారంభమవుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.
కొనసాగుతున్న వర్షపాత లోటు:
ప్రస్తుత సీజన్‌లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే 15 శాతం మేర వర్షపాత లోటు నమోదైందని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోటు తీవ్రత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 43 శాతం, తెలంగాణలో 20 శాతం మేర వర్షపాత లోటు కొనసాగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దక్షిణాదిలో 21 వరకు వర్షాలు – ఏపీ, తెలంగాణలకు హెచ్చరిక:
రుతుపవనాలు ఉపసంహరణ దిశగా సాగుతున్నప్పటికీ, దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఈ నెల 21వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీల మధ్య పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రైతులు, ప్రజలు వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.