కరువు కొరల్లో.. కర్నూలు .. తుంగభద్ర తీరంలో అన్నదాత " వర్రీ " .. అప్పుల్లో పత్తి రైతు
కర్నూలు.. సూర్య ప్రతినిధి
తీవ్రమైన ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కరువు కొరల్లోకి కూరుకుపోతుంది.. జిల్లాకు జీవనాడైన తుంగభద్ర నది ఎడారిగా మారింది.. అన్నదాత వేసుకున్న వరి పంట పండక సాగు నిరంధక వాడిపో తుంది.. పెట్టిన పెట్టుబడును రాక అన్నదాతలు వర్రీ అవుతున్నారు..
జూన్ జూలై మాసంలో ముందస్తుగా మురిసిన వానలకు రైతన్నల ఆనందోత్సవంతో పత్తి పంటను సాగు చేశారు.. అనంతరం వానలు కురవకపోవడంతో జిల్లాలో దాదాపు నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాలు పత్తి పంట దెబ్బతిన్నది.
తుంగభద్రా నదిలో చుక్క నీరు లేకపోవడంతో ఆ తీరం వెంట ఉన్న కౌతాళము కోసిగి మంత్రాలయం నందవరం సి బెళగల్ గూడూరు కర్నూలు మండలాల రైతులు నది నీళ్లు నమ్ముకొని వేసుకొన్న పంటలు వాడిపోతున్న నేపథ్యంలో అప్పులు ఎలా తీర్చాలి అని నీళ్లు నము లుతున్నారు.. ఒక్క ఎకరానికి 30 నుండి 45 వేల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతాంగం పరిస్థితులు ఆగమ్య గోచారంగా వున్నాయి.. ఇక ప్రభుత్వం పంటల బీమా రైతుల చేత కట్టించుకుంది.. భీమా నువ్వు వర్తింపజేసి పంట నష్టపరిహారం అందిస్తే కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం పెట్టుబడులు అయిన చేతులకు అందుతాయని ఆశాజనకంగా ఉన్నారు ..