BREAKING
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణది కీలక పాత్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 24న జిల్లా సాఫ్ట్ బాల్ జూనియర్ జిల్లా ఎంపిక పోటీలు మద్యానికి డబ్బులు లేక రైలు కింద పడి వ్యక్తి మృతి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం

సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం

Select Suryaa Now
సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం

శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన  పథకానికి రూ.లక్ష విరాళం

అన్నవరం, సెప్టెంబర్ 19: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి కాకినాడ వాస్తవ్యులు ఎస్. సూరిబాబు, శ్రీమతి సుజాత దంపతులు రూ.1,00,000/- విరాళాన్ని అందజేశారు.
ఈ విరాళాన్ని దేవస్థానం సూపరింటెండెంట్ గంటా విష్ణుకు అందజేసిన దాతలు, తమ విరాళంపై వచ్చే వడ్డీతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన భక్తులకు అన్నదానం నిర్వహించాలని కోరారు. భక్తులకు నిరంతరం అన్నప్రసాదాన్ని అందించాలనే ఉద్దేశంతో నిత్యాన్నదాన పథకానికి విరాళం అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా సూపరింటెండెంట్ గంటా విష్ణు పేర్కొంటూ దాతలను అభినందించారు.
దేవస్థానంలో నిత్యాన్నదాన పథకం ద్వారా ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్న నేపథ్యంలో భక్తుల సేవకు దాతలు ముందుకు రావడం పట్ల దేవస్థానం అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి సభ్యులు నాగేంద్ర చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, బి.ఎస్.ఎన్. రాజు తదితరులు పాల్గొన్నారు.