BREAKING
పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఆసియా క్రీడల ప్రారంభోత్సవం వాతావరణ సవాళ్లకు భారత్ పరిష్కారాలు అందిస్తోంది: ప్రధాని నరేంద్ర మోదీ 51 వేల మందికి నియామక పత్రాలందించిన ప్రధాని మోదీ సెప్టెంబర్ 20న భారత్‌కు బిజీ షెడ్యూల్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక భవనం నిర్మాణం కు ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర కృషి చేయాలి.... పలు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొడ్డేటి కిరణ్ కుమార్.. ఐఐటీ బాంబేలో విద్యార్థి బలవన్మరణం.. పరీక్షలో చాట్‌జీపీటీ వివాదం విదేశీ ఉద్యోగాల కోసం సువర్ణ అవకాశం దేశవ్యాప్తంగా నాలుగు హైకోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల సత్యదేవుని నిత్య అన్నదానానికి రూ లక్ష విరాళం బ్రిటన్‌లో సిక్కు బస్సు డ్రైవర్‌పై దుండగుడి దాడి.. వాహనం హైజాక్ చేసి బీభత్సం విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

-రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల భద్రతా ఏర్పాట్ల తనిఖీ

నంద్యాల అర్బన్:

త్రైమాసిక తనిఖీలో భాగంగా నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచిన గోదాములను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు భద్రపరిచిన గోదాముల భద్రతా ఏర్పాట్లు, సీల్‌లు, రక్షణ చర్యలు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న తీరును ఆమె తనిఖీ చేశారు. గోదాముల పరిసరాల్లో చేపడుతున్న భద్రతా చర్యలను కూడా పరిశీలించి, ఈవీఎంల భద్రత విషయంలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.nఈ తనిఖీలో డిఆర్ఓ రాము నాయక్, ఆర్డిఓ విశ్వనాథ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరపున సయ్యద్ రియాజ్ భాష, తెలుగుదేశం పార్టీ తరపున శివరామిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున సాయిరాం రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రదీప్, సీపీఐ తరపున నరసింహులు తదితర గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.