విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం
విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం
19వ వీరశైవ లింగాయత్ సమాజం పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్చెరు: విశ్వశాంతి కోసం వీరశైవ లింగాయత్ సమాజం 19 ఏళ్లుగా పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు ఉమామహేశ్వర దేవాలయం నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం వరకు నిర్వహించిన 19వ మహా పాదయాత్రను ఆదివారం ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సమాజ ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.