ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ
గ్యాస్ కట్టర్తో ఏటీఎం క్యాష్ మిషన్ ధ్వంసం…
సీసీ కెమెరాలు ధ్వంసం చేసి లక్షల రూపాయలు అపహరణ…
సూర్య కరీంనగర్ ప్రతినిధి::
కరీంనగర్ శివారులోని దుర్షేడ్ గ్రామంలో ఎస్బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. వేకువజామున సుమారు 3 గంటల సమయంలో స్కార్పియో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏటీఎంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి, గ్యాస్ కట్టర్ సహాయంతో క్యాష్ మిషన్ను కట్ చేశారు. అనంతరం అందులో ఉన్న లక్షల రూపాయల నగదును అపహరించుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీ కెమెరాల దృశ్యాలు, ఇతర ఆధారాల ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.