BREAKING
ది ప్యారడైజ్’ కంటెంట్ అద్భుతంగా వచ్చింది.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇంటర్వ్యూ విశేషాలు మెగాస్టార్ కొత్త సినిమా టైటిల్ సంచలనం: 'కాకా' అసలు అర్థమేంటో స్పష్టం చేసిన చిరంజీవి మృణాల్ ఠాకూర్ సస్పెన్స్ థ్రిల్లర్: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. నేరుగా ఓటీటీలోకి 'పూజా మేరీ జాన్' హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్.. మెగాస్టార్ చిరంజీవి, ఏషియన్ సినిమాస్ భారీ ప్లాన్ T20Iల్లో స్మృతి, షెఫాలీ 'సిక్సర్ల' రికార్డ్: ఏషియన్ గేమ్స్‌లో భారత ఓపెనర్ల విధ్వంసకర ప్రదర్శన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్వానంగా అంతర్గత రోడ్లు బాలాపూర్ గణనాథుని సన్నిధిలో విజయ్ దేవరకొండ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన 'రణబాలి' హీరో! ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. పోలీసుల కాల్పుల్లో వాంటెడ్ డ్రగ్ పెడ్లర్‌కు తీవ్ర గాయాలు వినాయక నిమజ్జనంలో దిల్ రాజు దంపతుల మాస్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ… ఇట్లు అర్జున టీజర్ ఈవెంట్: చిన్ననాటి స్నేహితుడి కోసం వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న లేడీ డైరెక్టర్! ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ ఫాంహౌజ్ ఏమైనా టూరిస్ట్ కేంద్రమా? మతిమరుపు అంతా వయసు వల్లే కాదు

తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ…

Select Suryaa Now
తిమ్మాపూర్ ఎస్‌బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి భారీ చోరీ…

 

సూర్య, తిమ్మాపూర్ ::


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ స్టేజీ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పక్కా పథకం ప్రకారమే వచ్చిన దొంగల ముఠా ఏటీఎంను ధ్వంసం చేసి భారీగా నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం.​అర్ధరాత్రి సమయంలో తిమ్మాపూర్ స్టేజీ సమీపంలోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోకి ప్రవేశించిన దుండగులు అత్యంత తెలివిగా చోరీకి పాల్పడ్డారు.చోరీకి ముందు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు ఏటీఎం లోపల ఉన్న సీసీ కెమెరాలపై నల్లటి స్ప్రే చల్లారు.అనంతరం గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎం యంత్రాన్ని కట్ చేసి, అందులో ఉన్న నగదును అపహరించుకొని పరారయ్యారు.ఆదివారం ఉదయం వాకింగ్‌కు వెళ్తున్న స్థానికులు ఏటీఎం మిషన్ ధ్వంసమై ఉండటాన్ని గమనించారు. లోపల చోరీ జరిగినట్లు గుర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆధారాలు సేకరించారు.
​దుండగులు స్కార్పియో వాహనంలో వచ్చి అతి తక్కువ సమయంలోనే చోరీ పూర్తి చేసి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.​ఏటీఎం పరిసర ప్రాంతాల్లోని, రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు తీవ్రంగా పరిశీలిస్తున్నారు.చోరీకి గురైన మొత్తం నగదు ఎంత అనేదానిపై బ్యాంకు అధికారులు పరిశీలన జరుపుతున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.