BREAKING
విగ్నేశ్వరస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి మహాకవి గురజాడ జయంతి రాష్ట్ర పండగే.. మరి జన్మభూమి ఎస్.రాయవరం సంగతేంటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే గర్వం, గుర్తింపు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరకట్న వేధింపులతో బీటెక్ విద్యార్థిని మృతి ఈవీఎం గోదాములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా విశాఖలో టీ బోర్డ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక టీ ప్రచార వేడుక ప్రారంభం 150 ఏళ్ల ఒంగోలు.. ఘన చరిత్రకు ఘన వేడుకలు! జలధార-జలహారతి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి- కలెక్టర్ రాజకుమారి గణియా AI యుగంలో నిరంతర అభ్యాసమే ఉద్యోగ భద్రతకు కీలకం: విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్.. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు: కలెక్టర్ జి. రాజకుమారి రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రతిభ – స్వర్ణ పతకాలు కైవసం అనంతపురం నగరంలో ద్విచక్ర వాహనంలో మంటలు OCA డైరెక్టర్ జనరల్‌తో క్రీడల మంత్రి మన్సుఖ్ మండావియా భేటీ టైర్-2, టైర్-3 నగరాల్లోనే సగం స్టార్టప్‌లు యువతకు అపూర్వ అవకాశాలు

ISSF జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

Select Suryaa Now
ISSF జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

పురుషుల ట్రాప్‌లో మెరిసిన యుగన్ శక్తివేల్
పోర్పెట్టో (ఇటలీ): ఇటలీలోని పోర్పెట్టో వేదికగా జరుగుతున్న 'ISSF జూనియర్ ప్రపంచ కప్ షాట్‌గన్ 2026' పోటీలలో భారతదేశానికి తొలి పతకం లభించింది. పురుషుల ట్రాప్ విభాగంలో తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల యువ షూటర్ యుగన్ శక్తివేల్ ముత్తుకుమార్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

ఎనిమిది మంది షూటర్లు పోటీపడిన ఫైనల్ రౌండ్‌లో యుగన్ సంపూర్ణ ఆధిక్యాన్ని కనబరిచాడు. నిర్ణీత 30 టార్గెట్లలో 27 టార్గెట్లను సమర్థవంతంగా ఛేదించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. ఇటలీకి చెందిన ఫ్రాన్సిస్కో టాన్‌ఫోగ్లియోపై కేవలం ఒక్క టార్గెట్ తేడాతో విజయం సాధించి, బంగారు పతకాన్ని ముద్దాడాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో యుగన్ 125 పాయింట్లకు గాను 114 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి, తీవ్ర ఉత్కంఠభరితంగా జరిగిన షూట్-ఆఫ్‌లో గెలిచి మెడల్ రౌండ్‌కు అర్హత సాధించాడు.

ఇదే విభాగానికి చెందిన ఇతర భారతీయ షూటర్లు అర్జున్, వినయ్ ప్రతాప్ సింగ్ చంద్రావత్ చెరో 112 స్కోరుతో వరుసగా 12, 13వ స్థానాల్లో నిలవగా, ఉధవ్ సింగ్ రాథోర్ 111 స్కోరుతో 16వ స్థానంలో నిలిచారు.

మరోవైపు మహిళల ట్రాప్ విభాగంలో జూనియర్ ఆసియా ఛాంపియన్ సబీరా హారిస్ క్వాలిఫికేషన్‌లో 108 స్కోరుతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరినప్పటికీ, పతకం సాధించలేకపోయింది. ఫైనల్లో 15 టార్గెట్లకు 9 మాత్రమే ఛేదించి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మిగిలిన భారత షూటర్లు భవ్య త్రిపాఠి, క్రిషికా జోషి ఇద్దరూ 105 స్కోరు సాధించి తృప్తిలో ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుని 9, 10వ స్థానాల్లో నిలిచారు.

ఈ ఏడాది జరుగుతున్న రెండో ISSF జూనియర్ ప్రపంచ కప్ ఇది కాగా, ఈజిప్ట్‌లోని కైరోలో జరిగిన తొలి టోర్నీలో భారత్ 16 పతకాలతో (5 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) అగ్రస్థానంలో నిలిచింది. శనివారం జరగనున్న జూనియర్ మిక్స్‌డ్ టీమ్ ట్రాప్ ఈవెంట్‌తో పోర్పెట్టో టోర్నీ ముగియనుంది.