నేటి నుండి గోవాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల పర్యటన
పనాజీ:కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 5 నుండి గోవాలో మూడు రోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ కార్యక్రమాలు, ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు మరియు పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
పర్యటన షెడ్యూల్ వివరాలు
సెప్టెంబర్ 6 (రెండవ రోజు) ఉదయం హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ విభాగాలకు సంబంధించి గోవా రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం మాదకద్రవ్యాల నియంత్రణ (Drug Control) అంశంపై ప్రత్యేక విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. 'అటల్ భవన్'లో నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.
ప్రాంతీయ సహకారంపై జరిగే 'వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్' సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. తలేగావ్లోని డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక 'ప్రెసిడెంట్స్ కలర్స్' (President's Colours) అవార్డును ప్రదానం చేస్తారు.